Archive for: June, 2010

మీ డిమాండ్ మేరకు సయీద్‌పై చర్య తీసుకోలేం: పాక్

పాకిస్థాన్ ద్వంద్వ వైఖరి మరోమారు బయటపడింది. కేంద్ర హోంమంత్రి చిదంబరం తన రెండు రోజుల ఇస్లామాబాద్ యాత్రను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న మరుక్షణమే పాక్ పాలకులు మాట మార్చారు. భారత్ చేస్తున్న డిమాండ్ మేరకు.. జేషే ముంబై దాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌పై చర్యలు తీసుకోలేమని తేల్చి చెప్పింది. దీంతో ఆ దేశం ఉగ్రవాద నిర్మూలనకు ఏమేరకు కట్టుబడి ఉందో అర్థం చేసుకోవచ్చు. భారత్ డిమాండ్‌పై పాక్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీ ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ భారత్-పాక్ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. ఇలాంటి వారిలో సయీద్ కూడా ఒకరని చెప్పారు. సరిహద్దు ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతున్న సయీద్.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని భారత్ చేస్తున్న వాదనలో అర్థం లేదన్నారు. ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో మాదిరిగానే పాకిస్థాన్‌లోనూ భావప్రకటనా స్వేచ్ఛ ఉందన్నారు. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు అన్ని రకాల ప్రసంగాలు చేసుకోవచ్చని చెప్పారు. తీవ్రవాద భావాలున్న ప్రజలు ఇటు పాకిస్థాన్‌లోనూ, అటు భారత్‌లోనూ ఉన్నారని గుర్తు చేశారు. ఈ విషయంలో తామేమీ చేయలేమన్నారు. ఇరు దేశాల్లోని మెజార్టీ ప్రజలు రెచ్చగొట్టే ప్రసంగాలను అంగీకరించబోరని, శాంతిని, అభివృద్ధిని కోరుకునే వీరు పరిస్థితులు సాధారణ స్థాయిలోనే ఉండాలని కాంక్షిస్తారని చెప్పుకొచ్చారు.

భారత్-కెనడా ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయం

భారత్-కెనడా దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో సరికొత్త అధ్యాయం ప్రారంభంకానుంది. ఈ రెండు దేశాలు పౌర అణు ఒప్పందంపై సంతకాలు చేశాయి. అలాగే, తీవ్రవాద చర్యలను ఇరు దేశాల నేతలు ముక్తకంఠంతో ఖండించారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు కెనడా భూభాగాన్ని వినియోగించరాదని ఈ సందర్భంగా ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ కెనడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆ దేశ రాజధాని టొరంటోలో జరిగిన జి-20 దేశాల శిఖరాగ్ర సదస్సు ఆదివారంతో ముగిసిన విషయం తెల్సిందే. అనంతరం భారత్-కెనడా దేశాలు పలు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. వీటిలో ముఖ్యమైంది పౌర అణు ఒప్పందం కావడం గమనార్హం. ఈ ఒప్పంద పత్రాలపై భారత అణు శక్తి సంస్థ కార్యదర్శి శ్రీకుమార్ బెనర్జీ, కెనడా విదేశాంగ మంత్రి లారెన్స్ కెన్నాన్‌లు ఇరు దేశాల ప్రధానమంత్రుల సమక్షంలో సంతకాలు చేశారు. అలాగే, రేడిధార్మిక భద్రత, న్యూక్లియర్ వేస్ట్ మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై కూడా ఉభయులు సహకారం ఇచ్చిపుచ్చుకోవాలని నిర్ణయించారు. 1974, 1998 సంవత్సరాల్లో భారత్ నిర్వహించిన ఫోఖ్రాన్ 1, 2 అణు పరీక్షల తర్వాత ఆర్థిక ఆంక్షలు విధించిన దేశాల్లో కెనడా కూడా ఒకటి. ప్రస్తుతం ఈ ఒప్పందంతో భారత్-కెనడాల మధ్య ద్వైవాక్షిక సంబంధాల్లో నూతన అధ్యాయం ప్రారంభంకానుంది.

Tv9 – Enterprising snakes

Tv9 – Kid affected with strange disease

Focus on Miraasi system at TTD

NDTv – Inspired by 3 Idiots, Jaipur students create a Wonder Bike

Actresses focusing on making quick money : Roja

Special Focus on Chhattisgarh Maoist attacks

Tv5 – Interview with Saina Nehwal

Nagarjuna @ Jayapradam talk show

Log in |Designed by Gabfire themes Free WordPress Theme
Wp Advanced Newspaper WordPress Themes Gabfire