ఉప ఎన్నికల ప్రచారంలో బాబ్లీ ఉద్యమ ప్రభావం: దేవేందర్

తెలంగాణ ప్రాంతంలో 12 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నేతలెవ్వరూ పాల్గొనలేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ గుర్తు చేశారు. ఈ ప్రభావం ఉప ఎన్నికల ఫలితాలపై ఉందని గౌడ్ చెప్పుకొచ్చారు. ఉప ఎన్నికల ఫలితాలపై దేవేందర్ గౌడ్ శుక్రవారం స్పందిస్తూ బాబ్లీ ఉద్యమాన్ని కేవలం తెలంగాణ ఉప ఎన్నికల్లో నాలుగు ఓట్లు సంపాదించుకోవాలనే ఉద్దేశ్యంతో చేపట్టలేదన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు చుక్క నీరు రావని, దీనివల్ల ఉత్తర తెలంగాణ ఎడారిగా మారుతుందనే ఉద్దేశ్యంతోనే చేపట్టామన్నారు. అందువల్లే తెలంగాణ ఉప ఎన్నికల్లో తాము ప్రచారం చేయలేక పోయామన్నారు. ఈ ప్రభావం ఉప ఎన్నికలపై పడిందన్నారు. ఈ ఫలితాల ఆధారంగా ఒక రాజకీయ పార్టీ మనుగడను అంచనా వేయలేమన్నారు. తెదేపా తిరిగి ఖచ్చితంగా పుంజుకుంటుందని దేవేందర్ గౌడ్ జోస్యం చెప్పారు.

Short URL: http://www.andhranews.in/?p=321014

Posted by admin on Jul 30 2010. Filed under Andhra News. You can follow any responses to this entry through the RSS 2.0. Both comments and pings are currently closed.

Comments are closed

Log in |Designed by Gabfire themes WordPress Themes
Wp Advanced Newspaper WordPress Themes Gabfire